కుమారధారాతీర్థం
వికీపీడియా నుండి
కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉందిది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రదమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.