పలాస కాశిబుగ్గ
వికీపీడియా నుండి
పలాస శ్రీకాకుళం జిల్లాకి అనాదిగ వాణిజ్య కేంద్రం. జిల్లా కి రెండవ రాజకీయ కేంద్రం అని చెప్పవచ్చు. ఉత్తర శ్రీకాకుళానికి రాజధాని వంటిది. పలాస జీడిపప్పు గురించి వినని వారు ఆంధ్ర రాష్త్రమున బహు కద్దు అని చెప్పటము అతిశయోక్తి కాదు. నిజానికి పలాస జీడిపప్పు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా వారికి కూడ సుపరిచితం. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాకంతటికి పెద్ద స్టేషను. ఇది ఖుర్దా డివిజన్ లొ అతి ఎక్కువ లాభాలు సముపార్జించిన స్టేషను.
పలాస మరియు కాశీబుగ్గలిని జంట పట్టణాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుగుదురు. అనేక సంవత్సరాలుగ నగర పంచాయితిగా వున్న ఈ పట్టణాలు ఈ మధ్యనే ఉమ్మడి మున్సిపాలిటిగా అవతరించాయి. అనేక తర్జన భర్జనల పిదప మున్సిపాలిటిని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిగా వ్యవహరిస్తున్నారు. పాలబుగ్గ అన్న పేరుకి కొంత వూతమొచ్చినప్పటికి, ఆ పేరు నిలదొక్కుకొలేక పోయింది. నిజానికి కాశీబుగ్గకి ఆ పేరు రావడానికి ఒక కారణం వున్నది, పల్లి వీధి అవతల వున్న గుడిలో ఒక బుగ్గ వున్నదని అందున నీరు కాశీ నుంచి వచ్చునని నానుడి.
ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో వుంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడ వున్నవి. పలాస సొంపేట శాసనసభ పరిధిలో వుంటే కాశీబుగ్గ టెక్కలి శాసనసభ పరిధిలో వుంది.ఈ విధముగా రెండు నియొజకవర్గముల కోలాహలము ఒకే పట్టణంలో చూడవచ్చు. కొన్ని కాశీబుగ్గ పొస్టల్ వీధులు సొంపేట శాసనసభ పరిధిలో వున్నై, ఎన్నికల సమయమున ఈ వీధులవారికి రెండు నియొజకవర్గములవారి హోరు పరిపాటి.