పలిదేవర్లపాడు
వికీపీడియా నుండి
పలిదేవర్లపాడు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని ఒక గ్రామం.
గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనది. ముఖ్యంగా వరి, ప్రత్తి, మిరప పండిస్తారు. ఏడాది పొడుగునా కృష్ణా నది నీరు అందుబాటులో వుంటుంది. పాల ఉత్పత్తి ప్రజల మరో జీవనాధారం.
గ్రామంలో 3 దేవాలయాలు ఉన్నాయి. అవి: రామాలయం, బ్రహ్మం గారి గుడి, బొడ్డురాయి. గ్రామంలో 75% ప్రాంతానికి రోడ్డు సౌకర్యం ఉంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ గ్రామంలో పుట్టి, పెరిగిన కొందరు విదెశాలలో స్థిరపడ్డారు. గ్రామంలో ప్రజలు మతసామరస్యంతో వుంటారు.
సమీపంలోని ప్రముఖ పట్టణం, సత్తెనపల్లి నుండి గ్రామానికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది.
[మార్చు] గణాంకాలు
- జనాభా: 1785
- పురుషులు: 897
- స్త్రీలు" 888
- అక్షరాస్యత: 61.38%
- పురుషుల అక్షరాస్యత: 73.29%
- స్త్రీల అక్షరాస్యత: 49.17%