మునిపల్లె రాజు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
తెలుగు కథను సుసంపన్నం చేసిన రచయితలలో మునిపల్లె రాజు ప్రముఖుడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. కాకుమాను మండలం గరికపాడు (కాకుమాను మండలం) లో 1925 మార్చి 16 న రాజు జన్మించాడు. తెలుగు పండితుడు జమ్మలమడక రామమూర్తి ప్రభావంతో సాహిత్యంలో ఆసక్తిని పెంపొందించుకున్నాడు. 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఉద్యోగం చేసాడు.
[మార్చు] రచనలు
- దివోస్వప్నాలతో ముఖాముఖి (కథలు)
- పుష్పాలు - ప్రేమికులు - పశువులు (కథలు)
- మునిపల్లె రాజు కథలు
- జర్నలిజంలో సృజనరాగాలు
- అలసిపోయినవాడి అరణ్యకాలు (కవితా సంపుటి)
- వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు (కవితా సంపుటి)
- పూజారి: ఈ నవలను పూజాఫలం పేరిట బి.ఎన్.రెడ్డి సినిమాగా తీసాడు.
[మార్చు] పురస్కారాలు
- 2006: అస్తిత్వనదం ఆవలి తీరాన అనే చిన్న కథకు 2006 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- 2004: అదే కథకు 2004 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం
- 2004: గోపీచంద్ పురస్కారం
[మార్చు] రాజు గురించి ప్రముఖులు
- మధురాంతకం రాజారామ్ "సమకాలీన సాహితీ నావికులకు మునిపల్లె రాజు గారొక లైట్ హౌస్"