మున్నంగి
వికీపీడియా నుండి
మున్నంగి గుంటూరు జిల్లా కొల్లిపర మండలములోని ఒక గ్రామము. మున్నంగి కృష్ణా నది తీరాన కలదు. దీనిని పూర్వము మునికోటిపురము అని పిలిచేవారు.
[మార్చు] పేరు వెనుక కథ
మునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావడానికి కారణంగా ఈ కథను చెప్పుకుంటారు. పూర్వం కోటి మంది మునులు కృష్ణా నది తీరాన ప్రాతఃకాలానికి ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయేవారు. ఒక రోజు కృష్ణా నదీ తీరాన గల పంట పొలాలలో (లంక)పని చేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రేయి అక్కడే నిదురించెను.అర్దరాత్రి సమయములో మెలకువ వచ్చిన ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణా నదీ తీరాన తపస్సు చేస్తూ కనిపించారు. ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు "ఈ విషయాన్ని ఎవరికైనా తెలియపరచిన నీ తల వేయి ముక్కలవును"అని శపించెను. భయముతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బందువులకు వెల్లడించగా, వెంటనే అతని తల వేయి వ్రక్కలయెను. ఆ తెల్లవారు ఝామున ప్రజలు కృష్ణా నదీ తీరానికి వెళ్ళి చూడగా మునులు అద్రుశ్యమై, ఆ రోజు నుండి వారు మరలా ఎవరికీ కనిపించలేదు. అలా ఈ ఊరికి "మునికోటిపురము" అనే నామము వచ్చెను. కాలక్రమేణా 'మున్నంగి'గా వ్యవహరించబడసాగెను.
[మార్చు] కొన్ని గణాంకాలు
- జనాభా: 6597
- పురుషులు: 3325
- స్త్రీలు: 3272
- అక్షరాస్యత: 69.35 శాతం
- పురుషుల అక్షరాస్యత: 73.77 శాతం
- స్త్రీల అక్షరాస్యత: 64.91 శాతం