అంట్యాకుల పైడిరాజు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు.
ఈయన 1 నవంబరు 1919 న బొబ్బిలి లో జన్మించారు. మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందారు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి వీరి గురువు.
వీరు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పారు. పైడిరాజు గారి చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, [[అమెరికా] మరియు సింగపూర్ కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.
అనాటమీ స్కెచెస్ వేయడంలో వీరు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో వీరిది ఒక ప్రత్యేకశైలి. వీరు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖందాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.