ఆదాము
వికీపీడియా నుండి
క్రైస్తవుల పవిత్ర గ్రంధమైన బైబిల్ ననుసరించి ఆదాము స్రుష్టిలోని మొదటి మానవుడు. ఆదాము అనె మాటకు “మట్టి”, “మనిషి” అని అర్థం. యూదా, మహమ్మదీయ మతాలు కూడా ఆదామును స్రుస్టిలోని తొలి మానవుడిగా పేర్కొంటాయి.
క్రైస్తవ ద్రుక్పధం
ఆదాము ఇతివ్రుత్తాంతం బైబిల్ లోని మొదటి పుస్తకమైన ఆదికాండం లో చెప్పబడింది. ఆదికాండం మొదటి అధ్యాయం లో, రెండొ అధ్యాయం లో ఇది వేరు వెరుగా చెప్పబడింది. ఈ కథనాల ప్రకారం ఆదాము దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున దేవునిచే స్రుజింప బడ్డాడు. దేవుడైన యెహోవా.నేల మంటినుండి నరుని నిర్మించి అతని నాసికా రంధ్రాలలో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడైన యెహోవా తూర్పున ఒక తోట వేసి దానిలో ఇతన్ని ఉంచాడు.అతడు ఆ తోటలో ఉంటూ దేవునితో నడిచాడు. స్రుస్టిలో జీవం కలిగిన ప్రతిదానికి ఆదాము ఏం పేరు పెట్టాడో ఆ పేరే దానికి కలిగింది. స్రుస్టిలోని సమస్తానికి ఏలికగా దేవుడతన్ని నియమించాడు.
ఆదాముకు సాటి అయిన సహాయం చెయ్యాలని అనుకున్నప్పుడు దేవుడతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి స్త్రీగా నిర్మించి అతనికిచ్చాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడ్డ స్త్రీ సైతాను చేత శోధింపబడి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడుల వివేచనను తెలిపే జ్ఞాన వ్రుక్ష ఫలాన్ని తాను తిని అతనిచేతా తినిపించినందున వారు ఏదేను వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆతర్వాత కష్టపడి, చెమటోడ్చి, శపించబడిన భూమిని సేద్యం చెయ్యటానికి నియుక్తుడయ్యాడు.
ఆదాము పెద్ద కొడుకు కయీను తన తమ్ముడైన హేబెలును చంపి మానవ చరిత్రలో తొలి హంతకుడుగా ముద్ర పడ్డాడు. ఆదాముకు మూడో కుమారుడైన షేతుకు ఎనోషు అనే కొడుకు పుట్టాక యెహోవా నామంలో ప్రార్థన చెయ్యటం మొదలైంది. ఆదాము తొమ్మిది వందల ముఫై ఏళ్ళు బ్రతికాడని బైబిల్ చెపుతుంది.
ఆదాము అనే పేరు కల్గిన ఒక పట్టణం యోర్దాను నదీ పరీవాహక ప్రదెసంలో ఉన్నట్టు యెహోషువా గ్రంధంలో పేర్కొన బడింది. బైబిల్ వెలుపలి చారిత్రకాధారాల ప్రకారం ఆదాము అనె ఈ పట్టణం దగ్గరి కొండ రాళ్ళు దొర్లిపడి యోర్దాను నదీ ప్రవాహం ఆగిందని సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలీయులు యొహోషువా నాయకత్వంలో యొర్దాను నది దాటి కనాను లోకి వెళ్ళారని తెలుస్తుంది.