కవి చౌడప్ప
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
కవి చౌడప్పగా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప 16వ శతాబ్దపు తెలుగు కవి.
తెలుగులో తొలి బూతుకవిగా పేరుతెచ్చుకున్న చౌడప్ప, ఎండలో ఎండనివాడు, వానలో తడవనివాడు లేనట్టే తన నీతి విననివాడుకూడా లోకంలో లేడని సగర్వముగా చెప్పుకున్నాడు. మట్లి అనంతరాజు ఆస్థానములో ఉన్న చౌడప్ప బూతాడక దొరకు నవ్వుపుట్టడు అని తన పద్యాలలో నిర్భయముగా ఉత్తమాంగాల నామవాచకాలు వాడాడు. తాను నీతిపద్యాల రచయితనని చాటుకొన్నా తెలుగు సాహితీ చరిత్రలో బూతుకవిగానే పేరు తెచ్చుకొన్నాడు.
మానవ జీవితములో బూతు సహజమని చౌడప్ప ఉద్దేశము. అయినా బూతు కోసము ఈయన బూతు చెప్పలేదు. కుందవరపు కవిచౌడప్పా! అన్న మకుటముతో ఈయన రాసిన కంద పద్యాలు కవి చౌడప్ప శతకముగా ప్రసిద్ధి చెందినవి. ఈ పద్యాలలో భాష కొంత మితిమీరినా భావములో మాత్రము సూటిగా నిజాన్నే ఎండగట్టాడు.
చౌడప్ప తన కవితా పటిమతో అనేక రాజులను మెప్పించి సరసాగ్రేసర చక్రవర్తి అన్న బిరుదు పొందాడు. ఈయన మెప్పించిన రాజులలో తంజావూరు నేలిన రఘునాథ నాయకుడు కూడా ఒకడు. చౌడప్ప కవే కాక గానవిద్యా ప్రవీణుడు కూడా.
చౌడప్ప శతకాన్నే కాక తెలుగులో మొట్టమొదటిదైన ఒక నిఘంటువును కూడా రచించాడని భావిస్తారు. ఒక శుద్ధాంధ్ర నిఘంటువులో చౌడప్ప సీసాలూ అన్న పేరుతో 30 పద్యాలు దొరికాయి. కానీ అవి కుందవరపు చౌడప్పే రచించాడో లేదో రూఢీ అవలేదు.
[మార్చు] మూలాలు
- సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర (9వ సంపుటము) పేజీ:153-159