రఘునాథరాజు
వికీపీడియా నుండి
తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడు ఈ రఘునాథరాజు. ఇతను 1600 - 1630 వరకు తంజావూరును పాలించినాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఊభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవారు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు.పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే సంస్కృతంలో రచింఛినారు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు వాల్మీకి చరిత్ర, రామాయణము అను పధ్య కావ్యములు, నల చరిత్ర అను ద్విపద కావ్యము. ఇహ జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానంలు. వీరి ఆస్థానంలోని కవులలోని ప్రముఖులు :
- చేమకూర వెంకటకవి
- గోవింద దీక్షితులు
- యజ్ఞనారాయణ దీక్షితులు
- కృష్ణాధ్వరి
- రామభద్రాంబ
- మధురవాణి