పర్ణశాల
వికీపీడియా నుండి
పర్ణశాల, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామము. ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి 32 కి మీ ల దూరంలో పర్ణశాల ఉన్నది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంధం రామాయణం లో పర్ణశాల ప్రసక్తి కలదు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి. వాగు వద్ద సీత స్నానం చేసిన తరువాత ఇక్కడి రథంగుట్ట పై చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని ఒక కథనం. ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్రా విశేషం.
రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి.
పర్ణశాల, ఖమ్మం జిల్లా, దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |