హైదరాబాదు విశ్వవిద్యాలయము
వికీపీడియా నుండి
హైదరాబాదు విశ్వవిద్యాలయము (University of Hyderabad) 1974 లో భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడినది. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయముగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటివల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్నత విద్యకు మరియు పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యా సంస్థగా ఎదిగినది.
విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - బాంబే రహదారి పై ఉన్నది. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన గోల్డెన్ త్రెష్హోల్డ్లో ఉన్నది.