నారా చంద్రబాబునాయుడు
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రియల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.తల్లి అమ్మనమ్మ తండ్రి ఖర్జూరనాయుడు.
[మార్చు] విద్యాభ్యాసం
చంద్రగిరిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్య్యుయేషన్ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుండి రాజకీయాల పట్ల అత్యంత ఆసక్తి కలిగి వుండేవాడు. విద్యాభాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా క్రార్యకరమాలతో పలువురి ప్రశంసలందుకున్నాడు.
[మార్చు] రాజకీయ చతురత
తరువాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది. దాంతో అయన పెద్దల దృష్టిలో పడ్డాడు. 1975వ సంవత్సరంలో చంద్రగిరి నియోజక వర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటి పారుదల శాఖా మంత్రిగా పని చేశాడు. కాంగ్రెస్ మంత్రి వర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తెను 1981 సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. 1983లో ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ ' తెలుగుదేశం' స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు. కానీ తరువాత కాలంలో ' తెలుగుదేశం ' పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు.1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశాడు.
1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు , ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాల బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పని చేసాడు.
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తిరుగుబాటుచేసి , అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు.
[మార్చు] పరిపాలనా విధానాలు
జన్మభూమి , నీరు-మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం- పరిశుభ్రత వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు నాయుడు " ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ " సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ఆధునికదిశగా అడుగు వేయించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్క్లింటన్, బిల్గేట్స్ వంటివారి ప్రశంసలు అందుకున్నాడు. దేశరాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణేతగా కొంతకాలంపాటు కీలకపాత్ర పోషించాడు. ఆ సమయాల్లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికే అంకితమవుతాని ప్రకటించి రాష్ట్రానికే పరిమితమయ్యాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చివేసి, పరిపాలనా రంగానికి హైటెక్ సొగసులద్దిన చంద్రబాబు నాయుడును అందరూ హైటెక్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. చంద్రబాబు నాయుడు ప్రవేశంతో పరిపాలనా విధానంలో వేగం పెరిగింది. ఇన్నిచేసినప్పటికీ వ్యవసాయరంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, ఆ రంగాలు నష్టపోయాయని పలువురు విమర్శిస్తుంటారు. విధివశాత్తూ చంద్రబాబు నాయుడు పదవీకాలంలోనే వరదలు, కరువు రెండూ సంభవించడంతో వ్యవసాయరంగం భారీగా నష్టపోయింది. 1999వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, 2004 వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది.
2003వ సంవత్సరంలో తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో నక్సలైట్లు క్లెమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది.
తండ్రి పేరు | నారా కర్జూరనాయుడు |
పుట్టిన రోజు | ఏప్రిల్ 20 1951 |
పుట్టిన ఊరు | నారావారిపల్లె, చిత్తూరు జిల్లా |
పెళ్ళి రోజు | సెప్టెంబర్ 10, 1981 |
భార్య పేరు | నారా భువనేశ్వరి (నందమూరి తారక రామారావు కుమార్తె) |
కుమారుడు | నారా లోకేష్ |
విద్యార్హతలు | యం.ఏ. (ఆర్థిక శాస్త్రం); శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
ప్రాధమిక చదువు | చంద్రగిరి |
కాలేజీ చదువు | శ్రీ వేంకటేశ్వరా ఆర్ట్స్ కాలేజీ, తిరుపతి |
తండ్రి వృత్తి | వ్యవసాయం |
నియోజకవర్గంలో వీరి చిరునామా | 14-248, పాలస్ రోడ్డు, కుప్పం, చిత్తూరు జిల్లా |
ఇంతకు ముందు ఉన్నవారు: నందమూరి తారక రామారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 1995 నవంబర్ 1—2004 మే 14 |
తరువాత వచ్చినవారు: వై.యస్.రాజశేఖరరెడ్డి |