వంశధార
వికీపీడియా నుండి
వంశధార ఒరిస్సా రాష్త్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో 150 కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా వద్ద ప్రవేశించి కళింగపట్నం అనే చోట బంగాళా ఖాతము లో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. గొట్టా (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక ఆనకట్ట వుంది.