విశ్వనాధ సత్యనారాయణ
వికీపీడియా నుండి
విశ్వనాధ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితులు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు, పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును "
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
విశ్వనాధ సత్యనారాయణ 1895 అక్టోబర్ 10 న కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లోను, పైచదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాధ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
తరువాతి కాలంలో విశ్వనాధ వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1933 వరకు), విజయవాడలో ఒక ప్రైవేటు కాలేజి (1933-1959), కరీంనగర్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు.
1957లో విశ్వనాధ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించాడు.
1976 అక్టోబరు 18న విశ్వనాధ పరమపదించాడు.
[మార్చు] సాహితీ ప్రస్థానం
1961 లో "విశ్వేశ్వర శతకము" తో విశ్వనాధ రచనా ప్రస్థానము ఆరంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో అ సమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. తరువాత విశ్వనాధ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 15 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 20 నాటకాలు, 60 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాధ వందల్లో రచనలందించాడు.
విశ్వనాధ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి
- ఆంధ్రపౌరుషము
- రామాయణ కల్పవృక్షం
- వేయి పడగలు
- కిన్నెరసాని పాటలు
- పురాణవైర గ్రంధమాల
- కాశ్మీర చారిత్రిక నవలలు
- మధ్యాక్కరలు
- నన్నయ ప్రసన్నకథాకలితార్ధయుక్తి
[మార్చు] పురస్కారాలు
- ఆంధ్రజాతి తమసంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవిసామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
- ఆంధ్రాయూనివర్సిటీ "కళాప్రపూర్ణ" అని సన్మానించింది.
- 1942 సంక్రాంతికి ఆయన 60వ జన్మదినవేడుకలలో ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవిగా గౌరవించింది.
- 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ జ్ఙానపీఠ పురస్కారాన్ని అందించినపుడు లభించిన సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది
As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene.
[మార్చు] రచనలు
- రామాయణ కల్పవృక్షము
- కిన్నెరసాని పాటలు
- ఆంధ్రప్రశస్తి
- పురాణవైర గ్రంధమాల
- మధ్యాక్కఱలు
- రురుచరిత్రము
- వేయిపడగలు
- ఏకవీర
- చెలియలికట్ట
- తెఱచిరాజు
- స్వర్గానికి నిచ్చెనలు
- ఆరునదులు
- పునర్జన్మ
- దమయంతీస్వయంవరం
- విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
- ఒకనాడు నాచనసోమన్న
- శాకుంతల అభిజ్ఞత
- ఝాన్సీరాణి
- కుమారాభ్యుదయము
- విశ్వనాధ పంచశతి
- మృతశర్మిష్ఠ
- దేవీత్రిశతి
- గోపికాగీతలు
- భ్రమరగీతలు
- శ్రీకృష్ణసంగీతము
- గుప్తపాశుపతము
- ప్రద్యుమ్నోదయము
- నేపాళరాజు చరిత్ర
- కాశ్మీర రాజ చరిత్ర
- సాహితీమీమాంస,
[మార్చు] ఉదాహరణలు
ఆంధ్ర పౌరుషము నుండి:
-
- గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
- తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
- పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
- కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
- అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
- విమల కృష్ణానదీ సైకతములయందు
- కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
- నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు