తెనాలి రామకృష్ణుడు
వికీపీడియా నుండి
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవి. అష్టదిగ్గజములలో ఒకరిగా భావిస్తున్నారు. ఆయన ఆంధ్రదేశమంతా బహు ప్రసిద్ధి చెందాడు. గొప్ప కావ్యాలు రాసాడు, కానీ తెలుగు వారు ఆయనను ఎక్కువగా హాస్య కవిగానే చూస్తారు. ఆయనకు వికటకవి అని బిరుదు ఉన్నది. ఆయన రాసిన మేకతోక, మేకకొక తోక, మెక మేకతోక ....... అనే పద్యము చాలా ప్రసిద్ధి చెందింది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.
మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి.
[మార్చు] వీరి రచనలు
[మార్చు] వీరి అలభ్య రచనలు
[మార్చు] చాటువులు
వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి. ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని చంధస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు:
ఎమితిని సెపితివి కపితము
బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో
యుమెతకయతిని సెపితో,
యమవసనిసి యనెడి మాటయలసని పెదనా
మరొక మారు, ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చినారట. అదేమంటే, ఈ కొలువు లో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఒక చాటువు వల్లించారట.
త్భౄ ...వటి బాబా తలపై పూవట ... అని జాబిల్లి నేపధ్యము లో చెప్పిన చాటువు, ఆ యన సమయస్ఫూర్తికి మచ్చుతునక.
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అల్లసాని వారు, షఠ్ఝా మఠ్ఝ కరాడ్ఝ్య వేడ్ఝ్య వసు తఢ్ఝా తఠ్ఝ తఠ్ఝ్యా ఖరే ... అంటూ చెప్పిన చాటువు అద్భుతం అద్వితీయం.
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |