భాగ్యరేఖ
వికీపీడియా నుండి
భాగ్యరేఖ (1957) | |
దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, సూర్యకాంతం, షావుకారు జానకి, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | పొన్నలూరి బ్రదర్స్ |
భాష | తెలుగు |
బి.ఎన్.రెడ్డి ఎంతో కష్టపడి తీసిన బంగారుపాప చిత్రం నిరాశపరచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బి.ఎన్. వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని బి.ఎన్. బంగారుపాప తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే 1957లో భాగ్యరేఖ తీశాడు. అలా అది తమ స్వంత సంస్థ వాహినీ వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా హిట్టైంది.
[మార్చు] కధ
"లక్ష్మి" అనే పిల్ల (పెద్దయిన తరువాత జమున ఈ పాత్ర ధరించింది.) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి పినతండ్రి పంచన చేరింది. పినతండ్రి ఆమె చేయి చూసి ఆ చేతిలో "భాగ్యరేఖ" మెండుగా ఉన్నదంటాడు. లక్ష్మి పినతల్లి (సూర్యకాంతం) తన కూతురు కాత్యాయిని (పెద్దయనాక షావుకారు జానకి) ని ముద్దు చేస్తూ లక్ష్మిని హింసిస్తూ ఉంటుంది.
లక్ష్మి తన తాతవద్దకు వెళ్లి పెరుగుతుంది. కాని వృద్ధుడైన తాత మరణించడంతో మళ్ళీ పిన తల్లిదండ్రులవద్దకు చేరింది. అక్కడ కాత్యాయినిని చూడడానికి వచ్చిన పెళ్ళివారు లక్ష్మిని చేసుకుంటామని అంటారు. పినతల్లి నిష్టూరాలకు బాధపడి లక్ష్మి ఇంటినుండి వెళిపోతుంది. తిరుపతిలో దైవ దర్శనం చేసుకొని ఆత్మహత్యకు సిద్ధమవుతుంది. కాని అప్పుడే ఒక తప్పిపోయిన చిన్న పిల్లను కాపాడి తల్లిదండ్రులవద్దకు చేరుస్తుంది. లక్ష్మి కధ విని ఆ ధనిక కుటుంబం ఆమెను తమతో తీసుకెళ్ళి తమ ఇంట్లో ఉంచుకొంటారు.
అక్కడ వారి కొడుకు (ఎన్.టి.రామారావు) లక్ష్మిని పెళ్ళాడదలచి ఎలాగో తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి సమయంలో పినతల్లి, ఇతరులు పన్నిన పన్నాగం వలన పెళ్ళి ఆగిపోతుంది. లక్ష్మి ఆ ఇంటినుండి దూరమౌతుంది. ప్రియుడు (రేలంగి)తో మద్రాసు వెళ్ళీ కాత్యాయిని కష్టాలపాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకొంటుంది.
మంచంపట్టిన కధానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు.
[మార్చు] పాటలు
- నీవుండేదా కొండపై స్వామి నేనుండేదీ నేలపై