ఖమ్మం
వికీపీడియా నుండి
ఇది ఖమ్మం పట్టణము గురించిన వ్యాసము.ఖమ్మం జిల్లా గురించిన వ్యాసమునకు ఇక్కడ చూడండి.
ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రము .
[మార్చు] చరిత్ర
ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతగా ఉంటుంది ,ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్లగోండ,వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి . ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది,మొదట దీనిని ఖమ్మం మెట్టుగా పిలిచేవారు. ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్థంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన.
[మార్చు] భౌగోళికము
ఖమ్మం భౌగౌళికము గా 17.25° ఉ 80.15° తూ లో ఉన్నది.దీనికి ఉత్తరం గా ఛత్తీస్ ఘర్,ఒరిస్సా ఈశాన్యం గా, తూర్పు-పశ్ఛిమ గోదావరి జిల్లాలు తూర్పు గా,వరంగల్ జిల్లా దక్షిణం గా వున్నది. దీని వైశాల్యం 16,029 చదరపు కిలోమీటర్లు.