ద్వారకా తిరుమల
వికీపీడియా నుండి
ద్వారకా తిరుమల మండలం | |
![]() |
|
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ద్వారకా తిరుమల |
గ్రామాలు: | 31 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 63.399 వేలు |
పురుషులు: | 32.531 వేలు |
స్త్రీలు: | 30.868 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 64.71 % |
పురుషులు: | 68.41 % |
స్త్రీలు: | 60.82 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామము, మండలము మరియు ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు రెండు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
విషయ సూచిక |
[మార్చు] ఆలయ ప్రశస్తి
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది. "పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
[మార్చు] ప్రధానాలయం

ప్రస్తుతము ఉన్న గుడిని మైలవరం జమీందారులు కట్టించారు. విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను ధర్మా అప్పారావు (1762-1827)కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సాంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు. ఆలయము యొక్క ఐదు అంతస్థుల గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ అనేక దేవతల విగ్రహములు అధిరోహించబడినవి.
గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు ప్రతిష్టింపబడినవి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్నప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం దగ్గరలో) ఉన్నాయి.
ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉన్నది. ఆ ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి. స్వామివారి పుష్కరిణిని నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి.
గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా పద్మావతి, నాంచారి (శ్రీదేవి, భూదేవి)కొలువై ఉన్నారు.
[మార్చు] ఇతర ఆలయాలు
కొండపైన ప్రధానాలయానికి కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు.
కొండపై టూరిజమ్ డిపార్ట్మెంటు "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
కొండక్రింద సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది.
కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి)ఆలయం : కొండకు కొద్ది దూరంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ.
ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల నడుపబడుతున్నది.
[మార్చు] మండలంలో గ్రామాలు
|
[మార్చు] బయటి లింకులు
[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు