తుళువ నరస నాయకుడు
వికీపీడియా నుండి
తుళువ నరస నాయకుడు సాళువ నరసింహదేవ రాయలు వద్ద సేనాని, ఇతను బహుమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించినాడు.
సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించినాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన తిమ్మ భూపాలుడును తరువాత రెండవ నరసింహ రాయలును సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించినాడు, లేదా అధికారాన్ని చెలాయించినాడు
విషయ సూచిక |
[మార్చు] మొదటి దండయాత్ర
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించినారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. చోళ, పాండ్య, మధుర సామంతులు స్వతంత్రించినారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496 లో దండయాత్రకు బయలుదేరినాడు. తూర్పు సముద్రంవరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి చోళ రాజును ముట్టడించినాడు. అప్పటి తిరుచినాపల్లి పాలకుడు కోనేటి రాజు ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన మానభూషనుడుని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత కర్నాట ప్రాంతమునందున్న ఉమ్మత్తూరు పై దండెత్తినాడు.
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి శ్రీరంగపట్టణం, శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న కావేరీ నది అడ్డు వచ్చినది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి శ్రీరంగమును ముట్టడించి భీకర యుద్దం చేసినాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చినది.
[మార్చు] బీజాపూరు పాలకునితో యుద్దం
బీజాపూరు పాలకుడైన యూసఫ్ ఆదిల్షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ కోటను ఆక్రమించినాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.
[మార్చు] గజపతుల దండయాత్రను అడ్డుకొనుట
1496న గజపతుల రాజు పురుషోత్తమ గజపతి మరణించినాడు, అతని కుమారుడు ప్రతాపరుద్ర గజపతి సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, కృష్ణా నది దాటి రాకుండా నరస నాయకుడు వీనిని ఓడించినాడు.
[మార్చు] మరణం
ఇతను 1503 లో మరణించినాడు
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ నరసింహ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1491 — 1503 |
తరువాత వచ్చినవారు: వీరనరసింహ రాయలు |