రెండవ హరిహర రాయలు
వికీపీడియా నుండి
రెండవ హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు మరణానంతరము 1377లో సింహాసమునకు వచ్చాడు.
విషయ సూచిక |
[మార్చు] సామంత రాజ్యాల పునరాధీనము చేసుకొనుట
మొదటి బుక్క రాయలు కుమారుడైన కంప రాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించినాడు. ఉదయగిరి కి దేవ రాయలును, మధుర ప్రాంతములకు విరూపాక్ష రాయలును అధికారులుగా నియమించినాడు.
[మార్చు] బిరుదులు
- రాజాధిరాజు
- రాజపరమేశ్వర
[మార్చు] యుద్దములు
మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్దాలు తప్పలేదు, తరువాత రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్దాలు తప్పలేదు. 1378 నందు బహుమనీ సుల్తాను ముజాహిద్ షా దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. 1378నందే రెండవ మహమ్మద్ షా సింహాసనము అధిస్టించినాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్తితులు చాలా గందరగోలంగా ఉన్నాయి. కొండవీడు రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి, కుమార గిరి రెడ్డి, కాటయవేమా రెడ్డి లమధ్య తరచూ యుద్దములు జరుగుతుండేవి. ఇదే సమయములో రేచర్ల పద్మనాయకులు బహుమనీ సుల్తానులతో స్నేహం చేసుకొని విజయనగర, కొండవీడు రెండు రాజ్యములనూ ఆక్రమించాలని గొప్ప పథకం రూపొందించినారు.
ఇటువంటి పరిస్తితులలో రెండవ హరిహర రాయలు కొండవీడు రాజ్యమందున్న శ్రీశైలం ప్రాంతమును ఆక్రమించినారు. కానీ కాటయవేమా రెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడించినాడు. హరిహర రాయలు కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు కాటయనకూ తన కుమారుడు లక్ష్మినకు వివాహం జరిపించినాడు. (విజయనగర రాజ్యచరిత్రలో ఈ వివాహాలు చాలా ప్రముఖ పాత్ర వహించినాయి, కొన్ని వివాహాలు విజయనగర రాజ్యానికి, దాని భవిష్యత్తు వెలుగులకూ పునాదులువేస్తే, కొన్ని దానిని మరింత బలపరిస్తే మరికొన్ని దాని పతనానికి కారణమయినాయి, వివరాలకు ఈ రాజుల వ్యాసాలు అన్నీ చదవగలరు)
[మార్చు] మోటుపల్లి యుద్దం
హరి హర రాయలు కుమారుడైన దేవ రాయలు ఉదయగిరి అధిపతి కదా, అతను సైన్యముతో మోటుపల్లి రేవును ఆక్రమించినాడు. తరువాత కొండవీడు రాజ్యముపైకి హరిహర రాయలు చౌండసేనాని ని పంపించినాడు, కానీ ఇదే సమయంలో కొండవీడును కుమారగిరి రెడ్డి నుండి స్వాధీనము చేసుకున్న పెదకోటి వేమా రెడ్డి విజయనగర సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేసెను.
[మార్చు] పద్మనాయకులతో యుద్దములు
[మార్చు] మొదటి దండయాత్ర
హరిహర రాయలు పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, యువరాజు అయిన రెండవ బుక్కరాయలును పంపించినాడు, ఈ యుద్దములో సాళువ రామదేవుడు అను యోఢుడు చాలా ప్రముఖ పాత్ర వహించినాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడలో పద్మనాయక ప్రభువులకు బహుమనీ సుల్తానులు సహాయం చేసినారు. కొత్తకొండ ప్రాంతమున జరిగిన అతి భీకర పోరాటంలో సాళువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలకు అర్పించినాడు. రెండవ బుక్క రాయలు ఓటమిభారంతో విజయనగరం తిరిగి వచ్చినాడు.
[మార్చు] రెండవ దండయాత్ర
1397లో మరళా రెండవ హరిహర రాయలు, గండదండాధీశుడు వంటి అనేక వీరాతి వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి యువరాజు రెండవ బుక్క రాయలును మరళా పద్మనాయకులుపైకి దండయాత్రకు పంపించినాడు. ఇదే సమయలో [[దేవరాయలు] మరికొంత సైన్యముతో అలంపురంపైకి దండెత్తినాడు, ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ విజయనగర రాజ సైనికులు కృష్ణా నది ఉత్తరభాగమున ఉన్న పానుగల్లు కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే చౌల్ దాలోల్ ప్రాంతమును విజయనగర సైనికులు సాధించినారు.
[మార్చు] సింహళ దేశ విజయ యాత్ర
విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చినాడు. ఈ విజయము చాలా ముఖ్యమినది, ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించినారు.
[మార్చు] కొండవీడు యుద్దాలు
పైన చెప్పుకున్నట్టె కొండవీడు విషయములలోనూ వారి అంతఃకలహాలలోనూ విజయనగరరాజులు జోక్యము చేసుకున్నారు, కొన్ని ప్రాంతములు ఆక్రమించ ప్రయత్నించినారు, చివరకు కాటయ వేమా రెడ్డిగారికి వీరు సహాయము చేసినారు.
[మార్చు] కరువు
ఈ రాజు పరిపాలనా కలమున దేశమునందు గొప్ప కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది
[మార్చు] గురువు
వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!
[మార్చు] ఇతని వారసుడు
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన రెండవ బుక్క రాయలు ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, సింహళమును జయించినవాడు అయిన విరూపాక్ష రాయలు సింహాసము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించినాడు, కానీ రెండవ బుక్క రాయలు తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించినాదు, తరువాత దేవరాయలు ఉదయగిరి దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసం అధిస్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ చాలా చక్కని విజయవంతమైన పరిపాలన చేసినాడు
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: మొదటి బుక్క రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1377 — 1404 |
తరువాత వచ్చినవారు: విరూపాక్ష రాయలు |