రెండవ దేవ రాయలు
వికీపీడియా నుండి
రెండవ దేవ రాయలు వీర విజయ బుక్క రాయలు కుమారుడు, దేవ రాయలు యొక్క మనుమడు. ఇతను తండ్రి పాలనలోనే పగ్గాలు చేతబట్టినవాడు, సమర్థుడు, అధికార దక్షుడు, ఏనుగులు వేటాడటంలో నేర్పరుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ది చెందినదీ, నాలుగు చెరగులా వ్యాపించినది. దేశము సుసంపన్నము అయినది.
విషయ సూచిక |
[మార్చు] యుద్దములు
ఇతని కాలమునాటికి కొండవీడు బలహీనమైనది, దీనిని ఆసరాగాతీసుకోని తీరాంధ్రను జయించి, 1424 నాటికి కొండవీడు రాజ్యము అంతరించినది, అనేక చిన్న చిన్న సామంత దండనాయకులు స్వతంత్రించినారు. రెండవ దేవరాయలు తీరాంధ్రపైకి దిగ్విజయ యాత్రచేసి నరసరావుపేట, ఒంగోలు లను పంట మైలారరెడ్డి ని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. పొదిలిని ఏలుతున్న తెలుగు రాయలును ఓడించినాడు. చివరికి వారిని తమ సామంతులుగా స్వీకరించినాడు. ఇక్కడ ఓ ముఖ్య విషయం ఏమిటంటే ఈ తెలుగు రాయలు సాళువ వంశమునకు చెందినవాడు.
అలాగే దిగ్విజయ యాత్రను సాగించుతూ 1428 వ సంవత్సరమున కొండవీడు దుర్గమును జయించినాడు, తరువాత సింహాచల ప్రాంతములను వానియందలి పర్వత ప్రాంత భూభాగములను విజయనగర రాజ్యమున విలీనం చేసినాడు.
[మార్చు] గజపతులతో యుద్దాలు
1444లో కళింగ అధిపతులైన కపిలేశ్వర గజపతి తీరాంధ్రముపైకి దండయాత్రకు వచ్చినాడు, అతడు రాజమహేంద్రవరం వరకూ వచ్చినాడు, కానీ తరువాత రెండవ దేవరాయలు పంపించిన మల్లపవడయ చమూపతి ఈ దురాక్రమణను తిప్పికొట్టినాడు.
ఈ కాలమునాటికి దక్షిణ భారతమంతయూ విజయనగరాధీనములోనికి వచ్చినది.
[మార్చు] జాఫ్నాపై యుద్దం
లక్కన్న అను దండనాయకుని సారధ్యంలో దేవరాయ సైన్యం జాఫ్నా పై దండెత్తి కప్పమును స్వీకరించెను. రెండవ దేవరాయ రాజ్యము సింహళము నుండి గుల్బర్గ వరకూ, ఓడ్ర దేశము నుండి మలబారు తీరము వరకూ వ్యాపించినది.
[మార్చు] బహుమనీ సుల్తానులతో యుద్దములు
బహుమనీ సుల్తాను అహ్మద్ షా గొప్ప సైన్యమును ఏర్పాటుచేసుకోని దండెత్తి తొలి సారి విజయం సాధించినాడు. తరువాత అతడు పద్మనాయకులుపై దండెత్తినాడు, కానీ సరిఅయిన సమయానికి విజయనగర సైన్యం రానికారణంగా పద్మనాయకులు ఈ యుద్దమున ఓడిపొయినారు. అప్పటినుండి పద్మనాయకులూ, విజయనగరాధీశులూ మరళా శతృత్వము వహించినారు.
ఈ సారి దేవరాయలు 1443నందు బహుమనీ రాజ్యముపై దండెత్తి ముద్గల్లు, బంకాపూర్, రాయచూర్, లను ఆధీనం చేసుకోని బీజాపూర్, సాగర్ లపైకి సైన్యమును నడిపినాడు. ఈ యుద్దం అతి భయంకరంగా రెండు నెలలు జరిగినది, ఇరువైపులా చాలా నష్టాలు కలిగినాయి, చివరకు సంధి కుదిరినది, బహుమనీ, విజయనగర రాజ్యాల మధ్య కృష్ణా నది ఎల్లలుగా గుర్తించబడినాయి.
[మార్చు] ఇతని సైన్యము
ఇతని సైన్యము చాలా బలవంతమైనది, ఇతను చక్కని ముస్లిం సైనికాధికారులను పిలిపించి తన సైన్యానికి శిక్షణ ఇప్పించినాడు. తన సైన్యంలో రెండువేలమంది ముస్లింలను చేర్చుకున్నాడు. (ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు దారితీసినది, ఎందుకంటే అచ్యుతరాయల కాలం నాటికి సైన్యంలో ముస్లింల సంఖ్య చాలా పెరిగినది, కానీ వారు రాక్షస తంగడి యుద్దమున అచ్యుత రాయలకు వెన్నుపోటుపొడిచి యుద్దంలో రాయల మరణానికీ, తద్వారా విజయనగర పతనానికీ హేతువులలో ఒకరుగా నిలిచినారు)
ఇతని సైన్యం నందు రెండు లక్షల కాల్బలము, 80 వేల అశ్విక దళము, 60 వేల ధనుర్విద్య విశారదులూ ఉండేవారు.
[మార్చు] మతము
ఇతను శైవమతాభిమాని, పరమత సహనము కలవాడు, ఈ కాలములో అందరికీ ఆలయములు నిర్మించినాడు, ముఖ్యముగా జైనులకూ, ముస్లింలకూ, వైష్ణవులకూ, శైవులకూ ఆలయములు నిర్మించినాడు.
[మార్చు] సాహిత్యము
ప్రసిద్ద డిండిమ భట్టారకుడు ఈ కాలమునందలివాడే, ఇతనినే శ్రీనాథుడు ఓడించి కవిసార్వభౌమ బిరుదును తీసుకున్నాడు. కంచు డక్కను పగల గొట్టినాడు.
[మార్చు] రాయబారులు
- పర్షియా నుండి అబుల్ రజాక్ ఈ కాలంనాడే రాయబారిగా వచ్చినాడు.
- ఇటలీ యాత్రికుడు కౌంటే ఈ కాలంలోనే వచ్చినాడు.
[మార్చు] విజయ నగరము
ఇది ఏడు ప్రాకారములు కలది, ప్రాకారముల మధ్యలో పంట పొలాలు కలవు. దీని చుట్టుకొలత సుమారుగా 100 కిలోమీటర్లు.
[మార్చు] పండుగలు
ఆనాటి పండుగలు చాలా ఉత్సాహంతో జరుపుకునేవారు, ముఖ్యముగా దీపావళి, శివరాత్రి, వసంతోత్సవములు ఘనంగా జరుపుకునేవారు.
[మార్చు] రాజ్య విశేషములు
ఇందు 300 ఓడరేవులు కలవు! సామ్రాజ్యము ధనవంతమైనది. విజయనగరము చాలా అద్భుతంగా ఉండెడిది. రాజప్రాసాదము అత్యున్నతమైనది, మనోహరమైనది, నగర వీధులందు స్వర్ణరత్నాభరణములు, వజ్రవైడూర్యములు రాసులుగా పోసు అమ్ము వర్తక శ్రేష్ఠులు ఉన్నారు, సామ్రాజ్య ప్రజలు విలాసమయ జీవితము గడిపేవారు।
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: వీర విజయ బుక్క రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1424 — 1446 |
తరువాత వచ్చినవారు: మల్లికార్జున రాయలు |