నిజామాబాదు
వికీపీడియా నుండి
నిజామాబాదు జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | తెలంగాణ |
ముఖ్య పట్టణము: | నిజామాబాదు |
విస్తీర్ణము: | 7,956 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 23.43 లక్షలు |
పురుషులు: | 11.62 లక్షలు |
స్త్రీలు: | 11.81 లక్షలు |
పట్టణ: | 4.23 లక్షలు |
గ్రామీణ: | 19.20 లక్షలు |
జనసాంద్రత: | 294 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | 14.98 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 53.26 % |
పురుషులు: | 66.27 % |
స్త్రీలు: | 40.57 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
నిజామాబాదు (Nizamabad) జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తెలంగాణ ప్రాంతము నందు ఉన్నది. నిజామాబాదు నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాదు ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో అతిపెద్ద నగరం.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళిక వివరాలు
జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా మరియు మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 77-40' మరియు 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తిరించి ఉన్నది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.7'C, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.9'C గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5'C వరకు పడిపోవడం, వేసవిలో 47'C వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.
[మార్చు] జిల్లా గణాంకాలు
- రెవిన్యూ మండలాలు: 36
- రెవిన్యూ విభాగాలు: (3) బోధన్, నిజామాబాద్, కామారెడ్డి
- లోక్సభ నియోజకవర్గాలు:(1) నిజామాబాదు
- శాసనసభ నియోజకవర్గాలు: (9) జుక్కల్, బాల్ కొండ, ఆర్మూర్, బాన్స్వాడ, బోధన్, నిజామాబాదు, డిచ్పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి.
- నదులు: మంజీరా నది
- జిల్లా ప్రముఖులు:
- ప్రముఖ రచయిత డా.కేశవరెడ్డి. రాయలసీమలో జన్మించిన ఈయన, జిల్లాలోని డిచ్పల్లి లో స్థిరపడి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు.
[మార్చు] పర్యాటక ప్రదేశాలు
నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, కంటేశ్వర్ దేవాలయం, కిల్లా రామాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి.
[మార్చు] పుణ్య క్షేత్రాలు
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద మరియు సారంగాపూర్ మొదలైనవి కలవు.
- లింబాద్రి గుట్ట
లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశము భీంగళ్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవము జరుగును.
- బడా పహాడ్
వర్ని మరియు చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.
- సారంగాపూర్
నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగిఉంది.
- కంఠేశ్వర్
ఈకంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతిఏటా పెద్దేత్తున జరుపుతారు.
- డిచ్పల్లి రామాలయం - డిచ్పల్లి
- పురాతత్వ ప్రదర్శనశాల
నిజామాబాదు లోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో ప్పాతిరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబర్ లో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు మరియు అనేక రకములైన ఆయుధములు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
- ఖిల్లా రామాలయం
ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. క్రీ.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల నురుజులతో ఉంది. క్రీ.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.
- మల్లారం అడవి
మల్లారం అడవి నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. చూట్టు వన్య ప్రదేశములో ఒదిగిఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము మరియు ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు మరియు ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము.
- అశోక్ సాగర్
అందమైన శిలలు మరియు ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉన్నది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు.
- అలీసాగర్
అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లొ కట్టబడినది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి మరియు కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్ మరియు జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.
[మార్చు] నిజామాబాదు మండలాలు
భౌగోళికంగా నిజామాబాదు జిల్లాను 36 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
![]() |
1.రెంజల్
2.నవీపేట్ 3.నందిపేట్ 4.ఆర్మూరు 5.బాలకొండ 6.మోర్తాడ్ 8.భీమ్గల్ 9.వేల్పూరు 11.మాక్లూర్ |
13.యెడపల్లె
14.బోధన్ 15.కోటగిరి 16.మద్నూరు 17.జుక్కల్ 18.బిచ్కుంద 19.బిర్కూర్ 20.వర్ని 21.డిచ్పల్లి 22.ధర్పల్లి 23.సిరికొండ 24.మాచారెడ్డి |
25.సదాశివనగర్
26.గాంధారి 27.బాన్స్వాడ 28.పిట్లం 29.నిజాంసాగర్ 30.యెల్లారెడ్డి 32.లింగంపేట 33.తాడ్వాయి 34.కామారెడ్డి 35.భిక్నూర్ 36.దోమకొండ |
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | ![]() |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |